logo

విశ్వమానవాలికి శాంతి మార్గం చూపిన యేసుక్రీస్తు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా

కొత్తగూడెం : విశ్వమానవాళికి శాంతి మార్గం చూపిన యేసుక్రీస్తు ప్రపంచానికే ఆదర్శమని, అయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని సిపిఐ భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా కోరారు. శుభ శుక్రవారాన్ని పురస్కరించుకొని పట్టణ, పరిసర మండలాల్లోని చర్చిలను సందర్శించి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ విద్వేషాలు లేని సమాజ స్థాపనకు క్రైస్తవ మిషనరీలు, అనేక స్వచ్చంద సంస్థలు కృషిచేస్తున్నాయని వీరికి ప్రతిఒక్కరు సహకారం అందించాలని కోరారు. ప్రజలకోసం తన ప్రాణాలు అర్పించిన సందర్బంగా జరుపుకునే శుభశుక్రవారం దినాన్ని క్రైస్తవ కుటుంబాలు ఘనంగా జరుపుకోవాలని, నేలపై రోజులపాటు సమాజహితంకోసం, యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ క్రైస్తవ సోదరులు ఉపవాసాలు చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వి పూర్ణచందర్ రావు, పరమేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

11
1264 views